న్యూఢిల్లీ: గో ఫస్ట్ వాలంటరీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ను విచారణకు అనుమతిస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బుధవారం వెల్లడించింది. దీంతో ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ మొదలవుతుందని పేర్కొంది. ప్రెసిడెంట్ జస్టిస్ రామలింగం సుధాకర్, ఎల్ ఎన్ గుప్తాలతో కూడిన ఇద్దరు మెంబర్ల బెంచ్ ఈ కేసును విచారించింది. అభిలాష్ లాను ఇంటరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్(ఐఆర్పీ)గా ఎన్సీఎల్టీ నియమించింది.
కంపెనీకి మారటోరియం ప్రొటెక్షన్ కల్పించింది. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్లో ఇంటరిమ్ రిజొల్యూషన్ ప్రొఫెషనల్కు సాయం అందించాల్సిందిగా సస్పెండయిన కంపెనీ డైరెక్టర్ల బోర్టును ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ఖర్చుల కోసం రూ. 5 కోట్లను తక్షణమే ఇంటరిమ్ రిజొల్యూషన్ ప్రొఫెషనల్కు సమకూర్చవలసిందిగా కంపెనీకి ఉత్వర్వులు ఇచ్చింది.
