శరత్​ పవార్​ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ

శరత్​ పవార్​ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కమిటీ

నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ చీఫల్ శరత్​ పవార్​ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎన్​సీపీ ఇవాళ ప్యానెల్​ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా ఈ కమిటీ పవార్​ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించింది. కమిటీ దక్షిణ ముంబయిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయింది. ఇందులో శరద్​ పవార్ కుమార్తె సుప్రియా సూలే,  ఆయన మేనల్లుడు అజిత్​ పవార్​, ప్రఫుల్​ పటేల్​, ఛగన్​ భుజ్​బల్ సభ్యులుగా ఉన్నారు.

క్యాడర్​ నుంచి పెరిగిన ఒత్తిడి..

పదవీ విరమణపై పవార్​ తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలు, క్యాడర్​ని షాక్​కి గురి చేసింది. పవార్​నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్యాడర్​ ఒత్తిడి పెంచింది. స్పందించిన పవార్​ పునరాలోచించి రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఇదే క్రమంలో ఇవాళ జరిగిన ప్యానెల్​ సమావేశలో పవార్​ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు ప్రఫుల్​ పటేల్​ చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయనను అభ్యర్థించాలని తాము ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

3 రోజుల క్రితం రాజీనామా..

దేశమంతా శరద్​ పవార్​ ప్రభావం ఉంటుంది. ఆయన రాజీనామా చేస్తామంటే తాము ఒప్పుకోబోమని ప్రఫుల్​ పటేల్​ అన్నారు. కాగా 3 రోజుల క్రితం ఎన్సీపీ చీఫ్​గా శరద్​ పవార్​ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.