ఢిల్లీ : నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకింగ్ కు గురైంది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. సమస్యను గుర్తించిన సాంకేతిక నిపుణులు తక్షణమే పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ప్రకటించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ అకౌంట్ యధావిథిగా పనిచేస్తోంది.
ఇటీవల భారత్ లో వరుసగా ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఈ నెల 12న కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసిన హ్యాకర్లు.. దాని పేరు ఎలన్ మస్క్ గా మార్చారు. 50కి పైగా వరుస ట్వీట్లు చేశారు. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ ఖాతాను హ్యాక్ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.