ఎన్నికల్లో గెలుపోటములు సహజం : నీలం మధు

ఎన్నికల్లో గెలుపోటములు సహజం : నీలం మధు
  • మెదక్​ పార్లమెంట్​ కాంగ్రెస్​ ఇన్​చార్జి నీలం మధు 

అమీన్​పూర్, పటాన్​చెరు, వెలుగు: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమి ఎదురైనా కుంగిపోకుండా ప్రజల పక్షాన పని చేయాలని మెదక్​ పార్లమెంట్​ కాంగ్రెస్​ ఇన్​చార్జి  నీలం మధు సూచించారు.  గుమ్మడిదల మండలం మంబాపూర్​ పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన నర్సింలు,  గెలుపొందిన ఉపసర్పంచ్​, ఏడుగురు వార్డు సభ్యులను శనివారం నీలం మధు కలిశారు. 

ఓటమికి కుంగిపోకుండా నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. కాంగ్రెస్​ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్​ ప్రవీణ​ అశోక్​చారి, వార్డు సభ్యులు రవి, కృష్ణ, భాస్కర్, విజయ్, యాదమ్మ, రాజుగౌడ్, లీలావతి, నర్సింలు, రాజు, తిరుపతి, మల్లేశ్, హనుమంత్ పాల్గొన్నారు.  

కార్యకర్తలకు అండగా ఉంటా

గుమ్మడిదల మండలం నల్లవల్లిలో పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలను నీలం మధు పరామర్శించారు. గ్యాస్​ సిలిండర్​ పేలి ఇల్లు కాలిపోయిన కుమ్మరి ప్రశాంత్, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న  మంగళి విష్ణు, గాండ్ల జగదీశ్, బొడ్డు వికాస్​ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ప్రశాంత్​ కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేశారు. 

అనంతరం మాట్లాడుతూ​ పార్టీని నమ్ముకున్న  కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు నర్సింగ్​రావు, వీరభద్రస్వామి ఆలయ చైర్మన్​ ప్రతాప్​రెడ్డి, అన్నారనం మాజీ సర్పంచ్​ జైశంకర్​గౌడ్​, మాజీ వైస్​ఎంపీపీ వీరారెడ్డి, నాయకులు మహేందర్​రెడ్డి, అశోక్, మహేశ్, మల్లేశ్, వీరేశ్, శ్రీనివాస్, వెంకటేశ్, నాగరాజు, మురళీగౌడ్, శివ, నవీన్, కిరణ్​ ఉన్నారు.