- ఇద్దరిపై వేటు వేసిన కలెక్టర్ రాహుల్ శర్మ
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరిపై వేటు పడింది. పీఏసీఎస్ సీఈవో అప్పం సాగర్ను సస్పెండ్ చేయడమే కాకుండా మొట్లపల్లి పీపీసీ ఇన్చార్జి ఎన్.ప్రశాంత్ను విధుల నుంచి డిస్మిస్ చేసినట్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి వాల్యా నాయక్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళవారం కలెక్టర్ రాహుల్శర్మ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన సమయంలో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, ధాన్యాన్ని తరలించడంలో నిర్లక్ష్యం చేసినట్లు గుర్తించారని ఆయన తెలిపారు. దీంతో సీఈఓ, సెంటర్ ఇన్చార్జిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
