వీడిన నేరెడ్ మెట్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ

వీడిన నేరెడ్ మెట్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ

హైద‌రాబాద్ : ఆదివారం అర్థరాత్రి నేరెడ్​మెట్​, ఈస్ట్​ కృపా అపార్ట్​మెంట్​ లో నివసించే శ్యాం సుందర్​ (31) అనే వ్యక్తి హత్యకు గురైన విష‌యం తెలిసిందే.నేరెడ్​మెట్​​ పోలీస్టే షన్​ పరిధిలో జరిగిన ఈ మర్డర్​ కేసును చేధించారు పోలీసులు. బాధితురాలు మృతుడు శ్యాం సుందర్​ తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు​ ఫైల్​ చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్​ ఆదారంగా దర్యాప్తు ప్రారంభించిన‌ట్లు చెప్పారు.

సీసీ ఫుటేజ్​ ఆధారంగా మ‌ర్డ‌ర్ చేసింది విజయ అపార్ట్​మెంట్ ​లో నివసించే నవీన్​ (33) గా గుర్తించామ‌న్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు..కక్షతోనే తన ఫ్రెండ్​ శ్యాం సుంద‌ర్ ను ను హత్య చేసినట్లు నవీన్ ఒప్పుకున్నాడ‌న్నారు. దీంతో నిందితుడు నవీన్​ న్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కి తరలించినట్లు తెలిపారు నేరెడ్ మెట్ పోలీసులు.