
కోల్బెల్ట్, వెలుగు: నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను నేతకాని మహర్ సేవా సంఘం లీడర్లు కోరారు. మంగళవారం హైదరాబాద్లోని సోమాజిగుడాలో ఉన్న ఎంపీ నివాసంలో ఆయనను కలిసి మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నేతకాని సమాజానికి సంబంధించిన పలు సమస్యలపై సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామి, ప్రధాన కార్యదర్శి దుర్గం సిద్ధార్థ వివరించారు. నేతకాని సమాజం కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నేతకాని ఆత్మగౌరవ భవనానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు కేటాయించిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
భవనం పూర్తయ్యేలా చొరవచూపాలని కోరారు. నేతకాని కార్పొరేషన్ఏర్పాటు కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారని, అందుకు స్పందించిన సీఎం కార్పొరేషన్కు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర సర్కార్పై మరింత ఒత్తిడి తీసుకొచ్చి కార్పొరేషన్ఏర్పాటుకు కృషి చేయాలని ఎంపీని కోరారు. రాష్ట్ర నేత నాయకులు జాడి మధునయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గోమాస శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు శివలింగు, నాయకులు దుర్గం చరణ్ దాస్, జుమ్మిడి రాజేశ్, భీమరాజ్, భాను ప్రసాద్ తదితరులున్నారు.