సినీ ఫక్కీలో అర్ధరాత్రి నవవధువు కిడ్నాప్

సినీ ఫక్కీలో  అర్ధరాత్రి  నవవధువు కిడ్నాప్

సినీ ఫక్కీలో నవవధువును ఆమె తరుపు బంధువులు కిడ్నాప్ చేశారు.  ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో 2023 మే 24 అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ జంట కొండగట్టులో పెళ్లి చేసుకుని కారులో తిరిగి వెళ్తుండగా దాదాపుగా 15 మంది వారిని హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అడ్డుకున్నారు. 

అందులో కొందరు వధువును కారులో ఎక్కించుకుని వెళ్లిపోగా మరికొందరు వరుడిపై దాడి చేశారు. పోలీస్ స్టేషన్ కు కూత వేట దూరంలో ఈ  సంఘటన జరిగినప్పటికి తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు. 

వరుడు, వధువు ఇద్దరిది హనుమకొండ జిల్లాలోని మడికొండ గ్రామం అని తెలుస్తోంది. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో వధువు బంధువులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అపహరణ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.