తెలంగాణలో 4వేలు దాటిన కరోనా కేసులు: కొత్తగా 192 కేసులు నమోదు

తెలంగాణలో 4వేలు దాటిన కరోనా కేసులు: కొత్తగా 192 కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 192కేసులు నమోదు కాగా..8మంది మరణించారు. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 143, మేడ్చల్‌లో 11, సంగారెడ్డిలో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్లో 4, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో 3 చొప్పున, నాగర్ కర్నూల్, కరీంనగర్‌లో 2 చొప్పున, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,111 కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు.