కొవిడ్‌‌‌‌​ కొత్త స్ట్రెయిన్​ లక్షణాలు 

కొవిడ్‌‌‌‌​ కొత్త స్ట్రెయిన్​ లక్షణాలు 

ఏడాది క్రితం కరోనా వచ్చినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలు​ కొవిడ్‌‌‌‌​ లక్షణాలుగా చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు కొత్త స్ట్రెయిన్​ వచ్చాక మోకాళ్ల కింద నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం కూడా తోడయ్యాయి. 

ఎలాంటివి తినాలి? 

కొవిడ్‌‌‌‌​ పేషెంట్స్​ బాగా నీరసిస్తారు. ఆకలి లేకపోవడం కూడా కొవిడ్‌‌‌‌​ లక్షణం. ఇలా ఉన్న వాళ్లు ఘనాహారం​ తీసుకోలేరు. అలాంటప్పుడు లిక్విడ్​ ఫుడ్​ తీసుకునే ప్రయత్నం చేయాలి.
 
సమస్య తీవ్రత ఎలా ఉంది?
ఏడాది కింద కొవిడ్‌‌‌‌​ పేషెంట్స్​ హాస్పిటల్​లో చేరాల్సిన అవసరం వచ్చినవాళ్లలో 20 శాతం మందికే వెంటిలేటర్​ అవసరం పడేది. ఇప్పుడు పరిస్థితి మారింది. హాస్పిటల్లో చేరాల్సి వచ్చిన పేషెంట్లలో 80 శాతం మందికి వెంటిలేటర్స్​ అవసరం పడుతున్నాయి. ఒకప్పుడు వృద్ధులే హాస్పిటల్లో చేరాల్సి వచ్చేది. వాళ్లలో బీపీ, షుగర్​, ఆస్తమా పేషెంట్స్​కే సమస్య తీవ్రంగా ఉండేది. కానీ, కొత్త స్ట్రెయిన్​ ​ కరోనా సోకినవాళ్లు అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నా కూడా చాలా బాధపడుతున్నారు. ఆస్తమా, బీపీ, షుగర్​ వంటి ఆరోగ్య సమస్యలు లేని వృద్ధులే కాదు, అన్ని వయసుల వాళ్లూ హాస్పిటల్​లో చేరాల్సి వస్తోంది. నడి వయసు వాళ్లు, యువతకి కూడా ఈ స్ట్రెయిన్​​తో ప్రాణహాని ఉందని అర్థమవుతోంది. ఇప్పుడు ఈ వయసు వాళ్లకే ప్రమాదం అనుకునే పరిస్థితి లేదు. కానీ, పిల్లలకు సమస్య తక్కువగా ఉంది. వాళ్లకు వెంటిలేషన్​ అవసరంపడట్లేదు. 

ఎప్పుడు హాస్పిటల్​లో చేరాలి? 

కొవిడ్‌‌‌‌​ వస్తే అందరూ హాస్పిటల్లో చేరాల్సిన అవసరం రాదు. పాజిటివ్ అని తెలిస్తే డాక్టర్​ని ముందు కన్సల్ట్ చేయాలి. చెప్పిన మందులు వాడాలి. జ్వరం తీవ్రంగా, తగ్గకుండా ఉంటే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం వస్తుంది. ఆక్సీమీటర్​తో బాడీలో ఆక్సిజన్ శాతాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ ఇలా చెక్ చేసుకోవాలి. ఎస్​పీఓటూ 94 కు తగ్గితే అప్పుడు కచ్చితంగా హాస్పిటల్లో చేరాలి. 

నెగెటివ్​ వస్తే సమస్య లేనట్టేనా? 
 
పాజిటవ్​ వచ్చిన కొన్నాళ్ల తర్వాత కొవిడ్‌‌‌‌​ తగ్గుతుంది. నెగెటివ్​ రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత కొంత మంది హార్ట్ ఎటాక్​ తో చనిపోతున్నారని అంటున్నారు. దీనికి కారణం డి – డైమర్​ (రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం) జరగడం. కరోనా నెగెటివ్​ రిజల్ట్ వచ్చిన తరవాత బాడీలో రక్తం గడ్డ కడుతుందా? లేదా అని తెలుసుకోవడం కోసం డి – డైమర్​ టెస్ట్ చేయించుకోవాలి. సమస్య ఉందని గుర్తిస్తే రక్తం పలుచగా అవ్వడానికి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్​ ఇస్తారు. కొవిడ్‌‌‌‌​ తగ్గిందని అజాగ్రత్తగా ఉండకూడదు. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.
 
ఏ జబ్బులు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి? 

ఇంతకుముందు కిడ్నీ, బీపీ, షుగర్​, ఆస్తమా పేషెంట్స్​ జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు. వాళ్లే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు కూడా. వెంటిలేటర్స్​ అవసరం కూడా వాళ్లకే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. బాడీలో ఏ అవయవం అయినా కొవిడ్‌‌‌‌​ వల్ల సరిగా పనిచేయకపోవచ్చు. ఏ ఆర్గాన్​లో ఎఫెక్ట్ చూపిస్తుందో ఊహించలేం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. జీర్ణ, శ్వాస, నాడీ వ్యవస్థలపై కోవిడ్​ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇంతకు ముందు ఏ జబ్బు లేకపోయినా ఇబ్బంది పడుతున్నారు కొందరు. 

ఎన్ని రోజుల్లో కోలుకుంటారు?
సాధారణంగా కొవిడ్‌‌‌‌​ పేషెంట్​ కోలుకోవడానికి పద్నాలుగు రోజులు పడుతుంది. కొంతమంది మూడు రోజుల్లోనే కోలుకుంటారు. వెంటిలేటర్​ అవసరం వచ్చి, చికిత్స చేయించుకున్నవాళ్లు కోలుకోవడానికి పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం పడుతుంది. ప్రత్యేకించి ఇన్ని రోజులని చెప్పలేం. 

ఏ సమస్యకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? 

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించాలి, మాస్క్​ తప్పనిసరిగా పెట్టుకోవాలి. తర్వాత కొవిడ్‌‌‌‌​ టెస్ట్​ చేయించుకోవాలి. సీరియస్​గా లేదని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ప్రమాదం. కుటుంబ సభ్యులు, ఆఫీస్​లో కొలిగ్స్​కి సోకే ప్రమాదం ఉంటుంది. పాజిటివ్​ వస్తే హాస్పిటల్​లో చేరాల్సిన అవసరం లేకున్నా డాక్టర్​ని కన్సల్ట్ చేయాలి. పాజిటివ్​ వచ్చినవాళ్లు హోం ఐసోలేషన్​ పాటించాలి. వేడి నీళ్లు తాగాలి. ఆవిరి పడుతూ ఉండాలి. మల్టీ విటమిన్​ ట్యాబ్లెట్స్​ తీసుకోవాలి. ఇమ్యూనిటీకి విటమిన్​ – సి, జింక్​ ముఖ్యం. ఇవి కాకుండా విటమిన్​ – ఏ, డీ, ఈ, బీ కాంప్లెక్స్​​ విటమిన్లు కూడా ఇమ్యూనిటీని పెంచడానికి సాయ పడతాయి. అందువల్ల అందరూ మల్టీ విటమిన్​ ట్యాబ్లెట్స్​ తీసుకోవాలి. యాంటీ బయాటిక్స్​, ఇతర మందులు అందరికీ అవసరం లేదు. జ్వరం, జలుబు, నొప్పులు వస్తే లక్షణాన్ని బట్టి మందులు తీసుకోవాలి. కొవిడ్‌‌‌‌ పాజిటివ్ వచ్చినవాళ్లు ఈ మందులు వాడాలంటూ వాట్సాప్​లో వచ్చే మందులన్నీ కొని వాడొద్దు. అందరికీ అన్ని రకాల మందులు అవసరమవ్వవు. జ్వరం, దగ్గు ఉంటే యాంటి బయాటిక్స్​ తీసుకోవాలి. పాజిటివ్​ పేషెంట్స్​ అందరూ యాంటి బయాటిక్స్​ వాడాల్సిన అవసరం లేదు. 

అజాగ్రత్త వద్దు..

కొవిడ్‌‌‌‌ మందులతో తగ్గుతుంది అనుకోవద్దు. ఇప్పుడొచ్చిన కొత్త స్ట్రెయిన్ వల్ల రక్తంలో ఆక్సిజన్ లెవల్ పడిపోతుంది. ఆక్సిజన్​ అవసరం ఏర్పడుతోంది. హాస్పిటల్స్‌‌‌‌లో బెడ్స్ కొరత, ఆక్సిజన్​ కొరత ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొవిడ్‌‌‌‌​ వచ్చినవాళ్లు హోమ్​ ఐసోలేషన్​లో ఉంటే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లతో నేరుగా మాట్లాడొద్దు. ఫోన్​లో మెసేజ్​, కాల్​ చేయాలి. మాస్క్​ అందరూ పెట్టుకోవాలి. ఫిజికల్ డిస్టెన్స్​ పాటించాలి. కొవిడ్‌‌‌‌​ సోకినవాళ్ల పక్కన కూర్చోవడం, వాళ్లు తాకిన వస్తువులను పట్టుకోవడం వంటివి చేయొద్దు. హోమ్ ఐసోలేషన్​లో ఉన్నవాళ్లు బాగానే ఉన్నారని, ఏమీ కాదని అనుకుంటున్నారు. వాళ్ల నుంచి వైరస్‌‌‌‌ సోకిన మరొకరు అలాగే ఉంటారనే నమ్మకం లేదు. అలా అనుకొన్నవాళ్లు హాస్పిటలైజ్ అవుతున్నారు. శానిటైజర్​, మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్​ మాత్రమే కరోనా నుంచి కాపాడతాయి. 
                                                                 ....డాక్టర్​ నవోదయ, జనరల్ ఫిజీషియన్​, కేర్​ హాస్పిటల్, హైదరాబాద్