డిసెంబర్ 22 నుంచి ఓటీటీలో .. మోస్ట్ వాంటెడ్ కరీంనగర్ కుర్రాళ్లు

 డిసెంబర్ 22 నుంచి ఓటీటీలో .. మోస్ట్ వాంటెడ్ కరీంనగర్ కుర్రాళ్లు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని నలుగురు సామాన్య కుర్రాళ్ళ జీవితాల నేపథ్యంలో బాలాజీ భువనగిరి తెరకెక్కించిన పొలిటికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘కరీంనగర్స్- మోస్ట్ వాంటెడ్’. అమన్ సూరేపల్లి, సాయి సూరేపల్లి, అనిరుధ్ తుకుంట్ల ముఖ్యపాత్రలు పోషించారు. స్ట్రీట్ బీట్జ్ సినిమా సంస్థ నిర్మించింది. డిసెంబర్ 22 నుంచి  ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘కరీంనగర్ వాలే’ పాట చార్ట్ బస్టర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. అలాగే ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

బలగం’ రైటర్ రమేష్ ఎలిగేటి దీనికి కథా, కథనం, మాటలు రాశారు. యాభై మంది రంగస్థల నటీనటులను ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేశాం. దాదాపు అందరూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌ వాళ్లే. సిరీస్ మొత్తం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో షూట్ చేశాం’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.