తెలంగాణలో మరో 2,574 పాజిటివ్ కేసులు

తెలంగాణలో మరో 2,574 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,574 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,40,969 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి 9 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 886కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,927 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,07,530గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. మరో 25,449 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 325, రంగారెడ్డి 197, మేడ్చల్ 185, నల్గొండ 158, కరీంనగర్ 144, ఖమ్మం 128, వరంగల్ అర్బన్ 117, సూర్యపేట్ 102, నిజామాబాద్ 95, సిద్ధిపేట్ 88, కామారెడ్డి 86, సంగారెడ్డి 82, జగిత్యాల 81, మహబూబా బాద్ 73, భద్రాద్రి 69, పెద్దపల్లి 69, యాదాద్రి 67, మంచిర్యాల్ 63, నాగర్ కర్నూల్ 51 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

డిశ్చార్జ్‌లలో రికార్డ్.. ఒక్కరోజులోనే 70 వేల మంది డిశ్చార్జ్

దొంగతనం చేసిండని కట్టేసి తమ సరదా తీర్చుకున్రు

కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే