తెలంగాణలో మరో 978 కరోనా కేసులు

తెలంగాణలో మరో 978 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 978 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,31,252 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,307కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,446 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,10,480గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 16,430 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 27,055 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 40,79,688 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 91.01 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 185, మేడ్చల్ 86, రంగారెడ్డి 89, ఖమ్మం 62, నల్గొండ 59, భద్రాద్రి 47, కరీంనగర్ 27, సిద్ధిపేట్ 27, వరంగల్ అర్బన్ 25 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

బెంగళూరు వరద బాధితులకు 25 వేల సాయం

పండగపూట విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఒకే ఇంట్లో అయిదుగురు మృతి

ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

దుబ్బాక ఎన్నికల ముందు సిద్దిపేట కలెక్టర్ బదిలీ