డిగ్రీ పరీక్ష రాసిన కొత్త పెండ్లికూతురు

డిగ్రీ పరీక్ష రాసిన కొత్త పెండ్లికూతురు


కోరుట్ల, వెలుగు:   పెళ్లైన  2 గంటలకే   ఎగ్జామ్​ సెంటర్​కు  పెళ్లికొడుకుతో  కలిసి వచ్చి  ఓ పెండ్లి కూతురు  డిగ్రీ  సెకండియర్​ కెమిస్ర్టీ ఎగ్జామ్​ రాసింది.   జగిత్యాల జిల్లా  కోరుట్లలో  శుక్రవారం   కొత్త పెండ్లికూతురు ఈర్నాల పద్మావతి ఆలియాస్​ లాస్య  తన భర్త రాజుతో కలిసి కల్లూరు రోడ్ లోని  ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఎగ్జామ్​ రాయడానికి వచ్చింది. ఆమెకు  సెంటర్​ చీఫ్​ సూపరింటెండెంట్​ ప్రత్యేక గది కేటాయించారు.  పెండ్లి సందడిలో బిజీగా ఉన్నప్పటికీ చదువుకోవాలన్న కోరికతో తన  భర్త సహకారంతో ఎగ్జామ్​ రాశానని పద్మావతి సంతోషంగా చెప్పింది.