నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై!

నికోలస్ పూరన్  షాకింగ్ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై!

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ఇస్తున్నట్లు బాంబ్ పేల్చాడు. అంతర్జాతీయ టెస్టు, వండే, టీ20లకు వీడ్కోలు ఇస్తున్నట్లు సోమవారం (జూన్ 9) ప్రకటించాడు. కేవలం 29 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని షాకింగ్ కు గురిచేసింది. 

సౌత్ ఆఫ్రికా కీపర్-బ్యాటర్ హెన్రీ క్లాసెన్  రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే పూరన్ కూడా అదే దారిలో రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులను షాకింగ్ కు గురిచేస్తోంది. అయితే పూరన్ ఫ్రాంఛైజ్ క్రికెట్ ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అంటే ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలు మాత్రం ఆడనున్నాడు.

ఎంతో ఆలోచించాక రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చానని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు పూరన్. ఇది చాలా కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ.. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని, ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు ఉన్నాయని తెలిపాడు. వెస్ట్ ఇండీస్ ప్రజలకు ప్రాతినిథ్యం వహించడం అదృష్టంగా పేర్కొన్నాడు. దేశం కోసం ఆడటం, గ్రౌండ్ లో నిలబడి జాతీయ గీతం ఆలపించడం.. ఆ ఉద్విఘ్నమైన క్షణాలను ఎప్పటికీ మరువలేనని చెప్పాడు పూరన్. ఇంతటి ప్రేమ, అభిమానాన్ని పంచిన ఫ్యాన్స్ కు రుణపడి ఉంటానని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

పూరన్ కెరీర్ లో ముఖ్యాంశాలు :

నికోలస్ పూరన్ 2016 సెప్టెంబర్  లో  వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించాడు. మొత్తం 61 వన్డేలు ఆడిన పూరన్ 1983 పరుగులు చేశాడు. 2023 జులై తర్వాత ఇంటర్నేషనల్ వండే మ్యాచ్ ఆడలేదు.  అదేవిధంగా 106 టీ20ల్లో 2,275 పరుగులు చేశాడు. దీంతో కరీబియన్ T20 లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా పూరన్ రికార్డు సృష్టించాడు. 136.39 స్ట్రైక్ రేట్ తో ఈ స్కోర్ సాధించడం విశేషం.

పూరన్ 2022లో టెస్టు కెప్టెన్ గా సేవలు అందించాడు. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన వండే వరల్డ్ కప్ లో ఫస్ట్ రౌండ్ లోనే వెస్టిండీస్ ఇంటి ముఖం పట్టడంతో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇక పూరన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20ల్లో మాత్రం పూరన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తూనే వచ్చాడు. లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో 36 సిక్సర్లు కొట్టి ఆ సీజన్ లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా రికార్డుకెక్కాడు. 2025 ఐపీఎల్ లో కూడా 40 సిక్సులతో మోత మోగించాడు.