
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ లాక్ డౌన్ ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా దేశాల్ని బట్టి జరిమానాలు, జైలు శిక్షలు అమలవుతున్నాయి. కానీ నైజీరియాలో మాత్రం లాక్ డౌన్ ను అతిక్రమించి బయట తిరిగే వారిని ఆదేశ పోలీసులు ఎక్కడ కనబడితే అక్కడ కాల్చిపడేస్తున్నారు. ఇలా సుమారు లాక్ డౌన్ ను అతిక్రమించిన 18మంది పోలీసులు కాల్చిచంపారని మీడియా సంస్థ అల్జీరియా తెలిపింది.
కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఆ దేశాధినేతలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 13 వరకు నైజీరియాలోని 36 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను ప్రకటించాయి.అయితే తాజా సమాచారం ప్రకారం నైజీరియాలో 407మందికి సోకగా 12 మంది చనిపోయారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను ఉల్లంఘించిన 18మందిని పోలీసులు కాల్చి చంపారు. ఈ కాల్పులుపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ నైజీరియా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 రాష్ట్రాల్లో కరోనా వైరస్ పేరుతో ప్రజలు జీవించే హక్కును సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు తమ చేతుల్లోకి తీసుకొంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు తమకు పోలీసులపై 105 ఫిర్యాదులు అందాయని, అందులో లాక్ డౌన్ ఉల్లంఘించిన 18మందిని కాల్చిచంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలను నేషనల్ పోలీస్ అధికార ప్రతినిధి ఫ్రాంక్ ఎంబా ఖండించారు. పోలీసులు ఎవరెవరిని చంపారో..బాధితుల వివరాలు, కాల్పులకు తెగబడ్డ పోలీసు అధికారులు వివరాలను మానవ హక్కుల సంఘం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.