
కాగజ్ నగర్, వెలుగు: ఈనెల 18న అర్ధరాత్రి యూరియా అమ్మిన మూడు ఫర్టిలైజర్ దుకాణాలపై అగ్రికల్చర్ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. సిర్పూర్ టీ మండలం భూపాలపట్నంలో శ్రీనివాస ఫెర్టిలైజర్, కౌటాల మండలం శీర్ష గ్రామంలో కొండయ్య ట్రేడర్, శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ ల ఫెర్టిలైజర్ లైసెన్స్ను సస్పెండ్ చేస్తూ కాగజ్ నగర్ ఏడీఏ మనోహర్ ఆదేశాలు ఇచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా యూరియా పంపిణీ చేయడంతో చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ అధికారులు పర్యవేక్షణలోనే యూరియా పంపిణీ చేయాలన్నారు. అర్ధరాత్రి అధికారులు లేకుండా, సమాచారం ఇవ్వకుండా పంపిణీ చేయడం రూల్స్కు విరుద్ధమన్నారు. రూల్స్ పాటించకపోతే లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.