అకాడమీ పెడతా: నిఖత్‌‌‌‌‌‌‌‌

అకాడమీ పెడతా: నిఖత్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రెండుసార్లు విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన తెలంగాణ స్టార్​ నిఖత్‌‌‌‌‌‌‌‌ జరీన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రం నుంచి తనలాంటి చాంపియన్లను తయారు చేయాలనిఅనుకుంటోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అన్ని సౌకర్యాలతో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేసి మేటి బాక్సర్లను తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ అకాడమీ ఏర్పాటు కోసం పది ఎకరాల ల్యాండ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయాన్ని నిఖత్‌‌‌‌‌‌‌‌ తండ్రి మహ్మద్ జమీల్ అహ్మద్ వెల్లడించారు. బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కోరిక నిఖత్‌‌‌‌‌‌‌‌ మనసులో చాన్నాళ్ల నుంచి ఉందన్నారు. ‘టాప్ బాక్సర్‌‌‌‌‌‌‌‌గా ఎదగడానికి ఏం కావాలో ఇప్పుడు నిఖత్​కు బాగా తెలుసు. పరిమిత సౌకర్యాలతో తను ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది. ఇండియాలో బాక్సర్లు, ముఖ్యంగా అమ్మాయిలు బాగా పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కానీ, వారికి సరైన హై పెర్ఫార్మెన్స్ సెంటర్ లేదు. అందుకే  సింథటిక్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌ సహా వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ సౌకర్యాలతో సిటీలో అకాడమీ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది.

ఈ విషయాన్ని మేం సెంట్రల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ అనురాగ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లాం. అలాంటి అకాడమీ నిఖత్ ఏర్పాటు చేస్తే ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌‌‌‌‌‌‌‌ కేటాయిస్తే కేంద్ర నుంచి నిధులు తప్పకుండా వస్తాయి. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి  10 ఎకరాల ల్యాండ్​ కేటాయించాలని  కోరుతూ నిఖత్‌‌‌‌‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు అటెండ్‌‌‌‌‌‌‌‌ అయిన స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సందీప్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సుల్తానియాకు కూడా చెప్పాం. ఈ విషయం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దృష్టిలో ఉందన్నారు’ అని జమీల్‌‌‌‌‌‌‌‌ వెలుగుతో చెప్పారు. కాగా, వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో రెండో గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన నిఖత్‌‌‌‌‌‌‌‌ జరీన్‌‌‌‌‌‌‌‌ను  రాష్ట్ర ప్రభుత్వం  గ్రూప్​1 హోదాలో డీఎస్పీగా నియమించే ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది.