
హైదరాబాద్,వెలుగు: ఫ్యామిలీ ప్లానింగ్, కొవిడ్- ఇన్సెంటివ్స్ ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్నాయని నిమ్స్లో నర్సులు ఆందోళన చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు డ్యూటీలకు వెళ్లకుండా నిరసన తెలిపారు. ఇన్సెంటివ్స్వెంటనే చెల్లించాలని లేకపోతే, వచ్చే నెల 7 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమ్మె నోటీసును కూడా ఇప్పటికే డైరెక్టర్కి అందించినట్లు నర్సులు తెలిపారు. ఆస్పత్రి మేనేజ్మెంట్ను తీరును నిరసిస్తూ నిమ్స్నర్సుల యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రోజూ గంట నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు.
For More News..