
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో గోవుల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ఏడు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఈ మేరకు సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ను, కొండాపూర్ సమీపంలోని సెయింట్ థామస్ స్కూల్ వద్ద ఉన్న చెక్ పోస్ట్ను గురువారం తనిఖీ చేశారు.
బక్రీద్ సమీపిస్తున్న నేపథ్యంలో పశువుల రవాణా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గోవులను రవాణా చేసే ప్రతి వాహనానికి సరైన పత్రాలు ఉంటేనే అనుమతించాలన్నారు. పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మతసామరస్యానికి భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించవద్దని, సోషల్మీడియాలో పోస్టులు చేయవద్దని సూచించారు.