న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్కు అన్ని దేశాలను ఒక తాటిపైకి తేవాల్సిందిగా ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా జార్జివాను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రిక్వెస్ట్ చేశారు. ఈ నెలలో బెంగళూరులో జరగబోయే జీ20 ఫైనాన్స్ మినిస్టర్లు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మీటింగ్పై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఎండీతో వర్చువల్గా ఫైనాన్స్ మినిస్టర్ డిస్కషన్ చేశారు. జీ20 ప్రెసిడెన్సీపై ఇండియాకు సపోర్టు చేస్తున్నందుకు ఐఎంఎఫ్కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు.
ఇండియా సాధిస్తున్న ఎకనమిక్ ప్రోగ్రెస్ కు క్రిస్టలినా అభినందనలు తెలియచేసినట్లు నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. గ్లోబల్గా సవాళ్లు ఎదురవుతున్న టైములో ఇండియా గ్రోత్సాధించడం, డిజిటలైజేషన్– డిజిటల్ పేమెంట్స్పై చొరవ తీసుకోవడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు నిర్మలా సీతారామన్ ఈ ట్వీట్స్లో వెల్లడించారు. అప్పులకు సంబంధించిన చర్చలే జీ20 ఫైనాన్స్ ట్రాక్లో ప్రధానంగా ఉండబోతున్నాయని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఐఎంఎఫ్ ఎండీకి తెలిపారు. దీంతోపాటు 16వ జనరల్ రివ్యూ కోటా, గ్లోబల్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ అంశాలపై చర్చ జరగనున్నట్లు వివరించారు.