కరెంట్‌ కార్ల  ప్రొడక్షన్ ​ఖర్చు తగ్గింపుపై నిస్సాన్​ ఫోకస్

కరెంట్‌ కార్ల  ప్రొడక్షన్ ​ఖర్చు తగ్గింపుపై నిస్సాన్​ ఫోకస్

30 శాతం తగ్గించాలని టార్గెట్​

న్యూఢిల్లీ : అన్ని ఎలక్ట్రిక్​, హైబ్రిడ్​ పెట్రోల్– ఎలక్ట్రిక్​ వెహికల్స్​ రేట్లను 2026 నాటికి తగ్గించాలనే ఫోకస్​తో ప్రయత్నాలు జరుపుతున్నట్లు నిస్సాన్​ మోటార్ కంపెనీ లిమిటెడ్​ గురువారం వెల్లడించింది. ముఖ్యంగా పవర్​ట్రెయిన్స్​తయారీ అప్రోచ్​ను మార్చుకోనున్నట్లు తెలిపింది. అన్ని మోడల్స్​లోనూ ఒకే తరహా కాంపోనెంట్స్​ వాడేలా చొరవ తీసుకుంటున్నట్లు కూడా పేర్కొంది. 2019 తో పోలిస్తే  ప్రొడక్షన్​ ఖర్చును 30 శాతం తగ్గించాలనే టార్గెట్​ పెట్టుకున్నట్లు నిస్సాన్​ తెలిపింది. సాలిడ్​ స్టేట్​ బ్యాటరీలు వాడటంతో పాటు, తక్కువ ఖర్చయ్యే మెటీరియల్స్​తో దొరికేవి వినియోగించనున్నట్లు  సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ తొషిహిరో హిరాయి మీడియాకు చెప్పారు. ఖరీదైన మెటల్స్​ కాకుండా ఇతర మెటీరియల్స్​ వాడి ఖర్చు తగ్గించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా ఎలక్ట్రిక్​ పవర్​ట్రెయిన్స్​ వంటి వాటి ఖర్చు కిందకి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. పవర్​ట్రెయిన్​ సైజు, వెయిట్​ తగ్గడం వల్ల వెహికల్​ పెర్​ఫార్మెన్స్​ మెరుగవుతుందని, మంచు–ఇసుక ఉన్న ప్రాంతాలలోనూ డ్రైవింగ్​ స్థిరంగా చేయడం వీలవుతుందని నిస్సాన్​ పేర్కొంది. మాస్ మార్కెట్​ కోసం ఎలక్ట్రిక్​ వెహికల్స్​ తెచ్చిన మొదటి కొద్ది కంపెనీలలో నిస్సాన్​ కూడా ఒకటి. పదేళ్ల కిందట ఈ కంపెనీ తన లీఫ్​ మోడల్ ను తెచ్చింది. 2030 నాటికి మొత్తం 27 ఎలక్ట్రిక్​ వెహికల్స్​, ఇందులో 19 పూర్తి ఎలక్ట్రికల్​ మోడల్స్​ మార్కెట్లోకి తేవాలని నిస్సాన్​ లక్ష్యంగా పెట్టుకుంది.