బాలికలను సమర్థులుగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

బాలికలను సమర్థులుగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్​,  వెలుగు :  విద్యార్థినులను సమర్థులుగా తీర్చిదిద్దడమే కాకుండా, మానసికంగా, సామాజికంగా దృఢంగా మార్చే వికాస కేంద్రాలుగా కేజీబీవీ, మోడల్ స్కూల్స్​ పనిచేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం నగరంలోని కపిల హోటల్​లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన స్పెషల్​ ఆఫీసర్లు, కేర్ టేకర్లు, వార్డెన్​ల ఐదు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్​లో కలెక్టర్​ పాల్గొని మాట్లాడారు. బాలికల పట్ల  ఆప్యాయత చూపితే తమ ఇబ్బందులను టీచర్లకు నిర్భయంగా చెబుతారన్నారు.

గర్ల్స్​ మానసిక స్థితిని నిరంతరం గమనించాలన్నారు. గుడ్​టచ్ బ్యాడ్​ టచ్​పై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు.  డీఈవో అశోక్​, ఉమ్మడి జిల్లా జీసీడీవోలు భాగలక్ష్మి, సుకన్య, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. తరువాత గంగస్థాన్​ నార్త్​ మండలంలోని కస్తూర్బా గాంధీ స్కూల్​ను కలెక్టర్ విజిట్​ చేసి డార్మెటరీ, స్టోర్​ రూమ్​ను​ పరిశీలించారు. క్లాస్​ రూమ్స్ సందర్శించి స్టూడెంట్స్​కు పాఠాలు బోధించారు. వారితో కలిసి చెస్ ఆడారు. వెంట తెచ్చిన చాక్లెట్స్​, బిస్కెట్స్ పంచారు. 

భూసేకరణలో స్పీడ్​ పెంచాలి..

జిల్లాలో నేషనల్ హైవేల నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా భూసేకరణలో వేగం పెంచాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఆర్మూర్​-మంచిర్యాల, మద్నూర్​-రుద్రూర్, బోధన్​-బాసర రోడ్ పనుల ప్రగతిని సమీక్షించారు. సబ్​ కలెక్టర్లు వికాస్​మహతో, అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.