- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ఎండాకాలం తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్లాన్లో ఉండాలన్నారు. ప్రతీ ఇంటికి శుద్ధ జలాలు అందేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంపీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని మండల స్పెషల్ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్తో మానిటరింగ్ చేయాలన్నారు.
టెన్త్ ఎగ్జామ్ సెంటర్లను సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లు తనిఖీ చేయాలని, పరీక్షల్లో అవకతవకలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అడిషనల్కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్కుమార్, సబ్ కలెక్టర్లు అభిగ్యాన్ మాల్వియ, వికాస్ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్ ఉన్నారు. అంతకు ముందు కలెక్టర్ నగరంలోని మానిక్భవన్ స్కూల్, నలంద హైస్కూల్ టెన్త్ పరీక్ష సెంటర్లను విజిట్ చేశారు. ప్రజావాణిలో 140 ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
