పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ చేస్తాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ చేస్తాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
  • కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి​ 

నిజామాబాద్​, వెలుగు: నగర కార్పొరేషన్​ పరిధిలో మంజూరైన నిర్మాణాలను ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్​లిస్ట్​లో చేరుస్తామని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం నగర పాలక సంస్థలో ఇంజినీర్లతో కలిసి నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో కలెక్టర్​మాట్లాడారు.  జోన్​ల వారీగా చేపట్టాల్సిన సీసీ, బీటీ రోడ్ నిర్మాణాలు, ప్యాచ్ వర్క్​ పనులు సమీక్షించారు. 

అగ్రీమెంట్​ ఖాతరు చేయని కంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. తరువాత మీటింగ్​ నాటికి ప్రగతి కనబడాలని సూచించారు.  అంతకు ముందు జక్రాన్​పల్లి మండలం పడ్కల్ విలేజ్ జడ్పీ హైస్కూల్​లో స్టూడెంట్స్​ కోసం నిర్వహించిన స్పోర్ట్స్ పరిశీలించారు. మండలంలో సెకండ్ ఫేజ్​ నామినేషన్స్​ ప్రక్రియను చెక్​ చేశారు.