
- నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
పోతంగల్, (కోటగిరి), వెలుగు : పోతంగల్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్లో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని మంజీరా నది వద్ద ఉన్న అంతర్ రాష్ట్ర చెక్పోస్ట్ను తనిఖీ చేశారు.
చెక్ పోస్ట్ సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పోతంగల్ చెక్పోస్ట్ద్వారా మహారాష్ట్ర వైపు నుంచి తెలంగాణలోకి అక్రమ రవాణా చేసే వాహనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సర్కిల్ సీఐ కృష్ణ, కోటగిరి ఎస్సై సునీల్ ఉన్నారు.