నిజామాబాద్, వెలుగు: ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. శనివారం ఆయన తన ఆఫీస్లో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
రంజాన్ పండగ కోసం మసీదుల్లో నమాజ్కు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ కంట్రోలింగ్ చేస్తున్నామని, పుకార్లు నమ్మొద్దన్నారు. తమ వర్గాల్లో అవగాహన పెంచడానికి మత పెద్దలు చొరవ చూపాలన్నారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా ఏసీపీలు ప్రకాశ్, శ్రీనివాస్, వెంకట్రెడ్డి, మస్తాన్అలీ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు ఉన్నారు.
23న యథావిధిగా పోలీస్ ప్రజావాణి..
ప్రతి సోమవారం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహించే పోలీస్ ప్రజావాణి 23న కూడా నిర్వహిస్తామని సీపీ సాయిచైతన్య తెలిపారు. గత రెండువారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, జడ్జి రూ.12.10 లక్షల జరిమానా విధించారని వివరించారు.
