నిజామాబాద్ రూరల్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓట్ చోరీకి పాల్పడుతుందని డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి ఆరోపించారు. బుధవారం డిచ్పల్లి మండలంలో పర్యటించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పారదర్శంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్ బీజేపీ సర్కార్కు జేబు సంస్థగా మారిందన్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తప్పుదోవలో విజయం సాధించారని విమర్శించారు. అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్న కేంద్రంలోని బీజేసీ సర్కర్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు.
త్వరలో జరిగే తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని, వారు చేసిన అప్పుల చిట్టాను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పల్లెపల్లెన వివరించి అభ్యర్థులకు గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, పలువురు కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
