నాలుగు రోజుల్లో కొనుగోళ్లు కంప్లీట్ చేయాలి : శరత్​

నాలుగు రోజుల్లో కొనుగోళ్లు కంప్లీట్ చేయాలి : శరత్​
  •     ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్​ శరత్​

కామారెడ్డి ​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో ఇంకా 35 వేల మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోళ్లను 4 రోజుల్లో కంప్లీట్​ చేయాలని  ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా స్పెషల్ ఆఫీసర్​, ట్రైబల్​ వెల్ఫేర్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ ఎ. శరత్ పేర్కొన్నారు. లేనట్లయితే ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  వడ్ల కొనుగోళ్లపై మంగళవారం కలెక్టరేట్లో  జిల్లా కలెక్టర్​ జితేష్​ వి పాటిల్, అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​లతో కలిసి ఆఫీసర్లతో రివ్యూ చేశారు.  అంతకు ముందు ఆయన భిక్కనూరు మండలం అంతంపల్లిలో వడ్ల కొనుగోలు సెంటర్​ను పరిశీలించారు.  

రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శరత్ మాట్లాడుతూ..  జిల్లాలో ఇప్పటి వరకు 2.65 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేశారన్నారు. ఇప్పటి వరకు సహాకరించినట్లుగానే మిగతా వడ్లను కూడా కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలన్నారు.  4 రోజుల్లో కొనుగోళ్లు కంప్లీట్ చేయటానికి ప్రతి సెంటర్​కు ఒక స్పెషల్​ ఆఫీసర్లను నియమించాలన్నారు.  తహసీల్ధార్లు, అగ్రికల్చర్​ ఆఫీసర్లను బాధ్యులు చేస్తూ మానటరింగ్​ చేయాలన్నారు.  

ఆఫీసర్లు, మిల్లర్లు, ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టర్లు   కో ఆర్డినేషన్​ చేసుకోవాలని సూచించారు.  డీఎస్​వో మల్లిఖార్జునబాబు, మేనేజర్ నిత్యానందం, జిల్లా ట్రాన్స్​పోర్ట్ ఆఫీసర్​ శ్రీనివాస్​రెడ్డి, అగ్రికల్చర్ జిల్లా ఆఫీసర్​ భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.