
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్బాల్ పోటీల్లో విజేతగా నిజామాబాద్ జిల్లా జట్టు నిలిచింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని సింగరేణి ఠాగూర్స్టేడియంలో శుక్రవారం పోటీలు నిర్వహించారు. ఫైనల్లో నిజామాబాద్,-ఖమ్మం జిల్లాల జట్లు పోటీ పడ్డాయి. 3-0గోల్స్తేడాతో నిజామాబాద్గెలుపొందింది. రెండోస్థానాన్ని ఖమ్మం, మూడో స్థానాన్ని రంగారెడ్డి, నల్గొండ జిల్లా జట్లు కైవసం చేసుకున్నాయి.
విజేతలకు మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్, క్యాతనపల్లి మున్సిపల్కమిషనర్గద్దె రాజు, రామకృష్ణాపూర్ టౌన్ ఎస్ఐ రాజశేఖర్బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సింగరేణి పర్సనల్ మేనేజర్ శ్యాసుందర్, కాంగ్రెస్ లీడర్ బండి సదానందం యాదవ్, ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, కాంగ్రెస్, సీపీఐ లీడర్లు గాండ్ల సమ్మయ్య, సాగర్రెడ్డి, మిట్టపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.