నిజామాబాద్ లో 45 తులాల బంగారం, 3 లక్షలు చోరీ

నిజామాబాద్ లో 45 తులాల బంగారం, 3 లక్షలు చోరీ

నిజామాబాద్ లో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈసారి బంగారు దుకాణాలను టార్గెట్ చేశారు. వినాయక్ నగర్ ప్రాంతంలోని మూడు గోల్డ్ షాపుల్లోకి చొరబడ్డ దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు. సిసి కెమెరా కేబుల్స్ కట్ చేసి, షెట్టర్ తాళాలు పగులకొట్టి బంగారు చోరీకి పాల్పడ్డారు. 45 తులాల బంగారంతో  3 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

ఓ దుకాణంలో చోరీ చేస్తుండగా దుండగులు సిసి కెమెరాకు చిక్కారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు.వరుస చోరీలతో నిజామాబాద్ వాసులు భయపడిపోతున్నారు.