సిద్దిపేట మెడికల్ కాలేజీలో పీజీ కోర్సుకు ఎన్ఎమ్​సీ ఉత్తర్వులు

సిద్దిపేట మెడికల్ కాలేజీలో పీజీ కోర్సుకు ఎన్ఎమ్​సీ ఉత్తర్వులు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సును మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎమ్​సీ) ఉత్తర్వులిచ్చింది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని ఎండీ పార్మా విభాగంలో పీజీ కోర్సుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు 2022–-23 విద్యా సంవత్సరానికి ఐదుగురు విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నారు. పార్మా విభాగంలో మందుల వినియోగం, సైడ్ ఎఫెక్టులు, శరీరంలో పనిచేసే విధానాన్ని  పీజీ విద్యార్థులు అధ్యయనం చేస్తారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సులకు అనుమతించాలని కోరగా.. ఫార్మా విభాగంలో మొదటి కోర్సుకు ఎన్ఎంసీ అనుమతిచ్చింది. అనాటమీ, బయోకెమెస్ట్రీలోనూ పీజీ కోర్సులకు అనుమతి కోసం అధికారులు దరఖాస్తు చేశారు.