- 50శాతం అదనపు చార్జీలు
- ఆర్టీసీ యాజమాన్యం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులను నడుపనుందని ఆ సంస్థ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు, తిరిగి డౌన్లో 18, 19 తేదీల్లో ఈ బస్సులను నడపనున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులపై మాత్రమే 50% అదనపు చార్జీలు వసూలు చేస్తామని, రెగ్యులర్ బస్సులకు పాత చార్జీలే వర్తిస్తాయ ని తెలిపారు.
పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి నుంచి జిల్లాలు, రాష్ట్రాలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.inలో బుక్ చేసుకోవాలన్నారు. వివరాలకు 040–69440000, 040– 23450033కి ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
