12లక్షల కోట్ల బంగారం నిక్షేపాలపై బాంబు పేల్చిన జీఎస్ఐ

12లక్షల కోట్ల బంగారం నిక్షేపాలపై బాంబు పేల్చిన జీఎస్ఐ

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,350టన్నుల గోల్డ్ నిక్షేపాలనున్నట్లు వస్తున్నట్లు వార్తల్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) ఖండించింది.

శుక్రవారం రెండు దశాబ్దాల వెతుకులాటలో రెండు బంగారు కొండలను జియాలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (జీఎస్​ఐ), ఉత్తర్​ప్రదేశ్​ డైరెక్టరేట్​ ఆఫ్​ జియాలజీ అండ్​ మైనింగ్​ గుర్తించినట్లు సోన్ భద్రా డిస్ట్రిక్ మైనింగ్​ ఆఫీసర్​ కేకే రాయ్​ తెలిపారు. దీంతో 12లక్షల కోట్ల విలువైన బంగారు నిక్షేపాలున్నాయనే వార్త దావానంలా పాకింది.

బంగారు నిక్షేపాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై అప్రమత్తమైన జీఎస్ ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.శ్రీధర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సోన్‌భద్ర జిల్లాలో భారీ మొత్తంలో బంగారు నిక్షేపాలు జీఎస్ ఐ గుర్తించలేదని, ఈ నివేదిక తాము ఇవ్వలేదని తెలిపారు. అంతేకాదు మైనింగ్ ఆఫీసర్ కేకే రాయ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన ఆయన  1998-2000 మధ్య ఖనిజ నిక్షేపాల కోసం యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో అన్వేషించామన్నారు.ఈ అన్వేషణలో మొత్తం 52,806.25 టన్నుల కేత్రాలుగా ఉండగా వాటిని వెలికి తీసి శుద్ధి చేస్తే టన్నుకు 3.03 గ్రాముల చొప్పున సాధారణ శ్రేణి బంగారం వస్తుందన్నారు. ఆ లెక్కన చూస్తే మొత్తం 160 కిలోల బంగారాన్ని వెలికి తీయోచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్ ఎం.శ్రీధర్‌ అంచనా వేశారు.