- డార్మిటరీలోనే డైనింగ్.. అందులోనే క్లాస్రూంలు
- ఒక్కో హాల్లో వంద మందికి పైగా స్టూడెంట్లు
- కొన్నిట్లో ఆరుబయటే క్లాసులు
- సరిపడా లేని బాత్రూమ్లు.. సక్కగ అమలుకాని మెనూ
- బీసీ, మైనార్టీ గురుకులాలకు ఒక్క సొంత బిల్డింగ్ లేదు
- ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోనూ అంతంతే
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రంలోని గురుకులాల్లో ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. వందల మంది స్టూడెంట్లను ఇరుకు గదుల్లో ఉంచి చదువు చెప్తున్నారు. చాలా గురుకులాల్లో ఇది క్లాస్రూం, ఇది డార్మిటరీ, ఇది డైనింగ్హాల్అని సెపెరేట్గా లేవు. ఓ హాల్ కేటాయించి అందులో పిల్లల్ని ఉంచుతున్నారు. అక్కడే తినుడు.. అక్కడే చదువుడు.. అక్కడే పండుడు అయితున్నది. దాదాపు 75 శాతం గురుకులాలకు సొంత బిల్డింగ్స్ లేవు. అద్దె బిల్డింగ్స్లో, ఇరుకిరుకు గదుల్లో వీటిని నడిపిస్తున్నారు. స్టూడెంట్స్ సంఖ్యకు సరిపడా బాత్రూంలు లేకపోవడంతో కొన్ని చోట్ల రెండు, మూడురోజులకోసారి స్నానం చేస్తున్నారు. వాష్ రూంలకు డోర్లు లేక రోజుల తరబడి క్లీన్చేయక, నల్లాలు పనిచేయక, బకెట్లతో నీళ్లను మోసుకెళ్లలేక పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. గీజర్లు లేక చన్నీటి స్నానాలు చేస్తున్నారు. మెష్డోర్లు లేక దోమలతో సావాసం చేస్తున్నారు. చాలా గురుకులాల్లో మెనూ సరిగ్గా అమలైతలేదు. మొదట్లో ఉన్న సన్నబియ్యం స్థానంలో దొడ్డు బియ్యం బువ్వను పెడ్తున్నారు. కొన్ని గురుకులాల్లో బెంచీలు లేక నేలమీద కూర్చొని చదువుకుంటుండగా.. ఇంకొన్ని చోట్ల ఆ జాగ కూడా లేక ఆరు బయటే టీచర్లు క్లాసులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సుమారు 30 గురుకులాలను ‘వెలుగు’ టీమ్ గురువారంవిజిట్ చేసింది. ఈ సందర్భంగా అక్కడి పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలు బయటపడ్డాయి.
అద్దె బిల్డింగులే దిక్కు!
రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ , 204 మైనార్టీ గురుకులాలు ఉండగా.. ఒక్కదానికి కూడా సొంత బిల్డింగు లేదు. 133 ఎస్టీ గురుకులాల్లో 30.. 268 ఎస్సీ గురుకులాల్లో 150 గురుకులాలూ అద్దె బిల్డింగ్స్లోనే నడుస్తున్నాయి. 665 గురుకులాలకు సొంత బిల్డింగ్స్ లేవు. అన్ని గురుకులాల్లో కలిపి 4.5 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. రెసిడెన్షియల్విధానంలో ఇంగ్లిష్ మీడియం కావడం, ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేయడంతో తల్లిదండ్రులు పోటీపడి గురుకులాల్లో పిల్లలను చేర్పించారు. చదువు సంగతేమోగానీ సౌలతులు, ఫుడ్ సరిగ్గా లేక పిల్లలు తిప్పలు పడుతున్నారు. సొంత బిల్డింగులు ఉన్నచోట్ల వసతులు బాగానే ఉన్నప్పటికీ.. అద్దె బిల్డింగుల్లో అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ సంఖ్యకు సరిపడా క్లాస్రూంలు, డార్మిటరీలు, డైనింగ్ హాల్స్, వాష్రూమ్స్ లేవు. సరిపడా టీచర్లు ఉండటం లేదు. కొన్ని గురుకులాల్లో టీచర్లు కూడా లేరని స్టూడెంట్స్ అంటున్నారు. వారంలో నాలుగురోజులు గుడ్డు, రెండురోజులు మటన్ , రెండు రోజులు చికెన్ పెట్టాల్సి ఉండగా.. వారంలో ఒకరోజు గుడ్డు, ఒకరోజు చికెన్తో సరిపెడుతున్నారు. ఇదేమని అడిగితే కాంట్రాక్టర్ సప్లై చేయట్లేదని, వస్తే పెడ్తాం.. అని అక్కడి సిబ్బంది చెప్తున్నారు.
ఏ జిల్లాలో చూసినా..
- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టీఎస్ బాయ్స్ గురుకులాన్ని 40 ఏండ్ల కింద కట్టిన ఓల్డ్ బిల్డింగులో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆరు నుంచి ఇంటర్ వరకు మొత్తం 640 మంది స్టూడెంట్లు ఉండగా.. 200 మంది ఒక డార్మెటరీలో, మిగిలిన వాళ్లు క్లాస్రూముల్లో పడుకుంటున్నారు. టాయ్లెట్స్, బాత్రూమ్లు అధ్వానంగా మారాయి. ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. టాయిలెట్కు, లెట్రీన్కు బయటికే వెళ్తున్నారు.
- కరీంనగర్ బొమ్మకల్ బైపాస్లోని కొత్తపల్లి మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో 750 మంది చదువుతుండగా.. సరిపడా రూమ్స్ల్లేవు. నేలమీదే కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. మెనూ సరిగ్గా ఉండట్లేదని, తినలేకపోతున్నామని స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇటీవల 50 మంది స్టూడెంట్స్ జ్వరాల బారిన పడి ఇండ్లకు వెళ్లిపోయారు.
- హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్లో 480 మంది స్టూడెంట్స్ ఉండగా, సరిపడా గదుల్లేక క్లాస్ రూమ్ నే డార్మిటరీగా మార్చుకున్నారు.
- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర పీవీ రంగారావు గర్ల్స్ గురుకులంలో 624 మంది స్టూడెంట్స్ ఉన్నారు. బెంచీలు, బెడ్స్ లేవు. ఇటీవల 13 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఇండ్లకు పంపించేశారు.
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారంలో ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్, పర్వతగిరి లో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్, కాలేజీ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 628 మంది స్టూడెంట్లు ఉన్నారు. మెనూ ప్రకారం ఫుడ్ పెడ్తలేరు. కాంట్రాక్టర్ సప్లై చేయకపోవడం వల్ల గుడ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రిన్సిపల్ చెప్పారు.
- ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురంలోని తెలంగాణ మైనారిటీస్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో డైనింగ్ టేబుల్ గానీ, స్టూడెంట్స్ పడుకునేందుకు బెడ్స్ లేవు. నేల మీదనే తిని, నేల మీదనే పడుకునే పరిస్థితి ఉంది. మొత్తం 350 మంది స్టూడెంట్స్కు 11 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. బోనకల్లు,చుంచుపల్లి, కుంచనపల్లి స్కూళ్లలో సరైన సౌలతులు లేక అక్కడి స్టూడెంట్లను కూడా కిష్టాపురం స్కూలులోనే ఉంచారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కిరాయి బిల్డింగ్లో నడుస్తున్నది. ఇరుకు గదుల వల్ల స్టూడెంట్లు అవస్థ పడుతున్నారు. వేడినీటి సదుపాయంలేక చలికాలంలో చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు.
- నాగర్కర్నూల్ఉయ్యాల వాడ బీసీ గురుకులంలో 600 మంది స్టూడెంట్స్ ఉండగా, 300 మంది ఇంటర్ స్టూడెంట్స్కు క్లాస్ రూమ్స్ లేవు. వీళ్లంతా ఆరు బయట చెట్ల కింద చదువుకుంటున్నారు. రాత్రి క్లాసురూముల్లో నిద్రపోతున్నారు. నల్లమల ఏజెన్సీ ఏరియాలోని అంబట్పల్లి రెసిడెన్సియల్ స్కూల్లో 450 మంది స్టూడెంట్స్కు 8 బాత్ రూమ్లే ఉన్నాయి. కాంపౌండ్ వాల్ లేక పోవడంతో పందులు, పాములు లోపలికి వస్తున్నాయి. అమ్రాబాద్ మండలం మన్ననూర్ రెసిడెన్షియల్ స్కూల్లో 642 మంది స్టూడెంట్స్ ఉండగా.. డార్మిటరీ, క్లాస్ రూమ్లు శిథిలావస్థకు చేరాయి. అన్నంలో బియ్యం ముక్కి, తెట్టలు కట్టి వాసన వస్తోందని స్టూడెంట్స్అంటున్నారు.
- నారాయణపేట మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలో 60 మంది స్టూడెంట్స్ ఉండగా.. 4 బాత్రూమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది.
- మెదక్ జిల్లా కౌడిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీని మెదక్ టౌన్లోని ఓ ప్రైవేట్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్ స్టూడెంట్లు 509 మంది ఉన్నారు. ఒక్కో రూమ్లో 50 మంది ఉంటున్నారు. గదుల కొరత వల్ల పిల్లలు పడుకునే రూమ్లలోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. భోజనం కూడా అక్కడే చేస్తున్నారు.
- నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పరిధిలోని శక్కర్ నగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలులో 5 నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే 454 పిల్లలు ఉంటున్నారు. ఇక్కడ గదుల కొరత ఉంది. మోపాల్ మండలం కంజర రెసిడెన్షియల్ స్కూలులో 440 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మూడేండ్ల కింద హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమైనా ఇంకా కంప్లీట్ కాలేదు.
- కామారెడ్డిలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్సియల్ స్కూల్లో 183 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 15 ఏండ్లుగా అద్దె బిల్డింగ్లోనే కొనసాగుతున్నది. సరిపడా బాత్రూమ్స్ లేక.. బయటే స్నానాలు చేస్తున్నారు. వేడినీటి కోసం గీజర్లు ఉన్నా.. వాడటం లేదు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడికి మహత్మా జ్యోతిబా పూలే గర్ల్స్ గురుకుల స్కూల్ మంజూరైంది. అక్కడ సరైన బిల్డింగ్ అద్దెకు దొరకకపోవడంతో సదాశివనగర్ మండలం కుప్రియాల్ దగ్గర బిల్డింగ్తీసుకొని నడిపిస్తున్నారు. సరైన సెక్యూరిటీ, పూర్తిస్థాయిలో సౌలతులు లేవు. బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 550 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అద్దె బిల్డింగ్లో కనీస వసతులు లేవు. బాత్రూమ్స్, టాయ్లెట్స్ సరిపోవడంలేదు.
అన్నం, కూరలు మంచిగుంటలేవు
అన్నం, కూరలు మంచిగుంట లేవు. చాలాసార్లు సరిగా ఉడకని అన్నం పెడ్తరు. దాన్ని తినబుద్ధికాక ఇబ్బందులు పడుతన్నం. చాలా సార్లు సగం కడుపుకే తింటున్నం.
- ఆకాశ్, 8వ తరగతి, మహాత్మా జ్యోతిభా పూలే రెసిడెన్సియల్ స్కూల్, కౌడిపల్లి, మెదక్ జిల్లా
బాత్రూంలు తక్కువున్నయి
మా గురుకులంలో 720 మంది స్టూడెంట్స్ ఉన్నరు. కానీ కొన్ని బాత్రూంలే ఉన్నయి. ఒక్కో బాత్రూం దగ్గర ఉదయం 20 మంది ఉంటున్నరు. టైమంతా అక్కడ్నే వేస్ట్ అవుతోంది. డ్రైనేజీ ప్రాబ్లమ్తో నీళ్లు బయటకు పోక ఇబ్బంది అయితాంది. ఇంకా చాలా సమస్యలున్నయి. -
‑ అంజలి, ఇంటర్మీడియట్ సెకండియర్, తుంగతుర్తి ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్, సూర్యాపేట జిల్లా
చాలా ఇబ్బందిగా ఉంది
సరిపోయేన్ని రూములు లేవు. ఒకే రూములో మస్తు మందిమి ఉంటున్నం. రాత్రి కొందరు బెంచీల మీద పండుకుంటే.. కొందరం కింద ఇరుకిరుకుగా పండుకుంటం. బాత్రూములు కూడా సరిపోయేన్ని లేక తిప్పలైతున్నది.
- నాగ చైతన్య, 8వ తరగతి, మహాత్మా జ్యోతిభా పూలే రెసిడెన్షియల్, కౌడిపల్లి, మెదక్ జిల్లా