
ముంబైలో గాలి నాణ్యతను గమనించిన బాంబే హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత క్రికెట్ బోర్డు.. ముంబై, ఢిల్లీలో నిర్వహించే ప్రపంచ కప్ మ్యాచ్లలో ఎటువంటి బాణాసంచా కాల్చకూడదని ప్రకటించింది. ఎందుకంటే కాలుష్యాన్ని మరింత పెంచుతుందని ఆరోపించింది.
ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జయ్ షా స్పందిస్తూ , “నేను ఈ విషయాన్ని ఐసీసీతో అధికారికంగా చర్చించాను. ముంబై, ఢిల్లీలో ఎటువంటి బాణసంచా ప్రదర్శనలు ఉండవు. ఇది కాలుష్య స్థాయిని పెంచుతుంది. పర్యావరణ సమస్యలపై పోరాడేందుకు బోర్డు కట్టుబడి ఉంది” అని తెలిపారు. పర్యావరణ సమస్యల పట్ల బోర్డు సున్నితంగా వ్యవహరిస్తుందని షా అన్నారు.
“ముంబై, న్యూఢిల్లీ రెండు నగరాల్లోనూ గాలి నాణ్యతకు సంబంధించిన అత్యవసర ఆందోళనను BCCI గుర్తించింది. క్రికెట్ వేడుకలకు తగిన రీతిలో ఐసీసీ ప్రపంచ కప్ను నిర్వహించేందుకు మేము ప్రయత్నిస్తున్నప్పటికీ, మా వాటాదారులందరి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం ”అని షా చెప్పారు. ఇక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం , అక్టోబర్ 31న ముంబైలో మొత్తం AQI రీడింగ్ 172గా ఉంది, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రమాదకర గరిష్ట స్థాయి 260ని తాకింది. ఢిల్లీలో, ఈ అక్టోబర్లో గాలి నాణ్యత 2020 కంటే అధ్వాన్నంగా ఉంది.
ముంబై, ఢిల్లీలను బాణసంచా రహితంగా మార్చడం ద్వారా క్రికెట్ బోర్డు బలమైన ప్రకటన చేస్తున్నదని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “ఇది పౌరులలో పర్యావరణ అవగాహనను పెంచే ప్రజా ప్రయోజన ప్రకటన. ఇది ఒక ఉదాహరణగా నిలవడానికి, గణనీయమైన సామాజిక మార్పును తీసుకురావడానికి ఒక మార్గం ”అని ఆయన చెప్పారు.