- అధ్వానంగా మూడు జిల్లాల పరిధిలోని 400 కి.మీ. కాలువ
నాగర్కర్నూల్, వెలుగు: కాల్వల నిర్వహణకు ప్రభుత్వం ఫండ్స్ఇవ్వకపోవడంతో కేఎల్ఐ పరిధిలోని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. బలహీనంగా మారిన కాల్వ కట్టలు తెగి ఎక్కడ తమ పంటలు కొట్టుకుపోతాయో అన్న భయంతో వంతులవారీగా కాపలా కాస్తున్నారు. కొన్నిచోట్ల రైతులే స్వచ్ఛందంగా రాళ్లు, మట్టి పోసి కట్టలు తెగకుండా రిపేర్లు చేసుకుంటున్నారు. చేసిన పనులకు డబ్బులు రాలేదని కేఎల్ఐ నిర్వహణ కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఉన్నవాటిని పట్టించుకోవడం మానేశారు. దీంతో నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ మూడు జిల్లాల పరిధిలో 400 కిలోమీటర్ల పొడవున్న కాలువల పరిస్థితి దైవాధీనంగా మారింది. మూడు రిజర్వాయర్ల నుంచి నీటిని డిశ్చార్జి చేసే మెయిన్కెనాల్స్లైనింగ్దెబ్బతిని మట్టితో కూరుకుపోతున్నాయి. మినిమం మెయింటెనెన్స్గ్రాంట్కూడా ఇవ్వడం లేదు. ఫీల్డ్లెవల్లో రిజర్వాయర్లు, లిఫ్టులు, పంపుహౌజులు, సర్జ్పూల్, కెనాల్స్సూపర్వైజ్చేయాల్సిన ఎస్ఈ, డీఈ స్థాయి ఇంజనీర్లకు వెహికల్అలవెన్స్రాక దాదాపు 9 నెలలు దాటిందని తెలిసింది. ఈ పరిస్థితుల మధ్య కేఎల్ఐ స్కీంలోని లిఫ్టులు, పంప్హౌజులు, కెనాల్స్ నిర్వహణ, మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.
అత్తెసరు బడ్జెట్
కేఎల్ఐ కెనాల్స్ కింద భూములు పోయిన రైతులకు అవార్డు ప్రకటించి టోకెన్ఇచ్చిన తర్వాత కూడా 29 ప్యాకేజి కింద ఇంకా దాదాపు రూ.19 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏడాది కాలంగా ఇవి పెండింగ్లో ఉన్నాయి. 28, 30వ ప్యాకేజీలలో టోకెన్ ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటాయని అంచనా. జొన్నలబొగడ–గుడిపల్లిగట్లు రిజర్వాయర్ల మధ్య అండర్ టన్నెల్మెయిన్ కెనాల్లో దాదాపు 800 మీటర్ల లైనింగ్పనులు ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ఏజెన్సీ అధికార పార్టీ నాయకుడిది కావడంతో ఇంజనీర్లు ఒత్తిడి చేయలేక వదిలేశారు. ఇంకా భూ సేకరణ చేస్తూనే ఉన్నారు. కాలువల నిర్మాణం, యూటీలు, బ్రిడ్జిలు, బ్రాంచ్, సబ్, మైనర్కెనాల్స్పనులను మధ్యలోనే వదిలేశారు. కేఎల్ఐ కింద చేపట్టాల్సిన పనులు, బకాయిలకు కలిపి బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించాలని ఇరిగేషన్ అధికారులు ప్రపోజ్చేయగా సర్కార్రూ.2 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ఏడాది కేంద్ర నిధులతో పాటు ఎన్ఆర్ఈజీఎస్కింద కేఎల్ఐ మెయిన్, బ్రాంచ్కెనాల్స్రిపేర్లు చేపట్టాలని ప్లాన్చేసినా కూలీలు రావడం లేదని ఇరిగేషన్ఆఫీసర్లు ఆరు నెలలు టైం పాస్చేశారు. దీంతో జిల్లాకు కేటాయించిన ఫండ్స్వృథాగా పోయాయి.
ఆఫీసర్లలో నిర్లిప్తత
నాగర్కర్నూల్జిల్లాలోని కేఎల్ఐ లిఫ్ట్పరిధిలోని మూడు పంప్హౌజ్ల నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన సంస్థలకు దాదాపు రూ.30 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. పంపులకు కనీసం గ్రీజు రాసేందుకు పైసలు లేవని వాపోతున్నారు. కాంట్రాక్ట్ఏజెన్సీలకు బకాయిలు, మెయింటెనెన్స్ఫండ్స్ఇవ్వకపోవడంతో ఇరిగేషన్అధికారులు వారిని బతిమిలాడి పనులు చేయిస్తున్నారు. ఇంతకు ముందు కాల్వలు తెగిపోయాయని సమాచారం వస్తే ఇరిగేషన్ ఆఫీసర్లు టెన్షన్పడి ఉరుకులు, పరుగులు పెట్టేవారు. నిధులు రావని వాళ్లకు అర్థం కావడంతో చూద్దాం, చేద్దాం అనేవరకు వచ్చారు. మెయిన్, సబ్బ్రాంచ్కెనాల్స్మట్టి, జనుముతో నిండిపోయినా వాటిని రిపేర్ చేయించే దిక్కు లేదు. చాలాచోట్ల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనుము పీకిస్తున్నారు. కాలువలు ఎక్కడికక్కడ తెగి రైతుల పంటలు నీట మునుగుతున్నా ఫండ్స్రాబట్టడంలో టీఆర్ఎస్ప్రజాప్రతినిధులు ఫెయిల్అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.