రూ. 2 వేల నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ

రూ. 2 వేల నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ:   రూ. 2000 నోట్లను రద్దు చేస్తుందని వస్తున్న వార్తల్లో నిజంలేదని  కేంద్రం  క్లారిటీ ఇచ్చింది. రెండు వేల నోట్ల రద్దు విషయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ఠాగూర్  రాజ్యసభలో చెప్పారు. ​ రెండు వేల నోటు రద్దు చేసి తిరిగి  వెయ్యి నోటును ప్రవేశపెట్టనుందనే అపోహ ప్రజల్లో నెలకొందని  ఎంపీ విశ్వంభర్​ ప్రసాద్​ ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చారు. రెండు వేల నోట్లను  ప్రవేశ పెట్టడం వల్ల దేశంలో బ్లాక్​ మనీ పెరిగిందని విశ్వంభర్​ ప్రసాద్  అన్నారు. దీనిపై  మంత్రి అనురాగ్​ ఠాగూర్​ మాట్లాడుతూ..2016 నవంబర్ ​ నాలుగో తేదీ నాటికి అన్ని డినామినేషన్లలో కలిపి రూ. 17, 741.87 బిలియన్ల విలువైన నగదు చెలామణిలో ఉండగా, 2019 డిసెంబర్​ 2 నాటికి ఆ విలువ రూ. 22, 356.48 బిలియన్లకు చేరుకుందని   వివరించారు. దేశంలో  బ్లాక్​మనీ , నకిలీ కరెన్సీని అరికట్టేందుకు 2016 నవంబర్​లో రూ. 500, రూ. 1000 నోట్లను  కేంద్రం రద్దు చేసింది.