న్యూఢిల్లీ: చట్టవ్యతిరేకంగా అప్పులు ఇస్తున్న 600 మొబైల్యాప్స్ను ఆర్బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ గుర్తించింది. ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పోయిన వారం మాట్లాడుతూ ఇట్లాంటి యాప్లపై గ్రూపు ఇచ్చిన రిపోర్టును పరిశీలిస్తున్నామని చెప్పారు. అన్రిజిస్టర్డ్ లెండింగ్ ప్లాట్ఫారమ్లపై ఆర్బీఐ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు వేలాది ఫిర్యాదులు అందాయి. లోన్లను చెల్లించనివారిని తీవ్రంగా వేధిస్తున్నారంటూ కంప్లైంట్లు రావడంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది.
లోన్లు ఇచ్చే యాప్లలో చాలా వరకు రిజిస్టర్ కాలేదని, ఇలాంటి సంస్థలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని దాస్ సూచించారు. ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయిన లోన్ల ప్లాట్ఫారమ్లపై ఫిర్యాదులు అందితే, అప్పుడు తాము చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పారు. ఇటువంటి లెండింగ్ యాప్ల నుంచి అప్పు తీసుకునేముందు బాగా ఆలోచించాలని కోరారు. యాప్లు రిజిస్టర్ అయ్యాయా లేదా అని కస్టమర్లు తప్పక చెక్ చేయాలని సూచించారు. రిజిస్టర్డ్ లెండింగ్ యాప్ల వివరాలు తమ బ్యాంక్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.