రంగారెడ్డి జిల్లా, వెలుగు: రేషన్కార్డు అప్డేట్కాకపోవడంతో తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లెకు చెందిన ఓ కుటుంబం ఇబ్బంది పడుతోంది. గ్రామానికి చెందిన చిన్నశెట్టి బాబు కుమారుడి వైద్యానికి ఆరోగ్యశ్రీ కార్డు కావాల్సి ఉంది. రేషన్కార్డులో పేరు లేకపోవడంతో ఆన్లైన్లో దరఖాస్తు చేయగా సివిల్సప్లై అధికారులు అప్డేట్చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.
తమ కుమారుడు మణివర్దన్ ఆరోగ్యం బాగా లేదని, వైద్యం అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు బాబు వాపోయారు. చికిత్సకు రూ.2.5లక్షల ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారని, తామకు అంత ఖర్చు భరించే స్థోమత లేదని చెప్పారు. రేషన్కార్డులో తమ కుమారిడి పేరు అప్డేట్చేసి ఆదుకోవాలని సివిల్సప్లై అధికారులును కోరారు.