వైద్యానికి సాయం చేయండి..

వైద్యానికి సాయం చేయండి..

రంగారెడ్డి జిల్లా, వెలుగు: రేషన్​కార్డు అప్​డేట్​కాకపోవడంతో తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లెకు చెందిన ఓ కుటుంబం ఇబ్బంది పడుతోంది. గ్రామానికి చెందిన చిన్నశెట్టి బాబు కుమారుడి వైద్యానికి ఆరోగ్యశ్రీ కార్డు కావాల్సి ఉంది. రేషన్​కార్డులో పేరు లేకపోవడంతో ఆన్​లైన్​లో దరఖాస్తు చేయగా సివిల్​సప్లై అధికారులు అప్​డేట్​చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.

తమ కుమారుడు మణివర్దన్‌ ఆరోగ్యం బాగా లేదని, వైద్యం అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు బాబు వాపోయారు. చికిత్సకు రూ.2.5లక్షల ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారని, తామకు అంత ఖర్చు భరించే స్థోమత లేదని చెప్పారు. రేషన్​కార్డులో తమ కుమారిడి పేరు అప్​డేట్​చేసి ఆదుకోవాలని సివిల్​సప్లై అధికారులును కోరారు.