నో రిజిస్ట్రేషన్.. నో ఇన్ కమ్...ఐదేండ్లుగా నాన్​ లే ఔట్లలో రిజిస్ట్రేషన్లు నిల్

నో రిజిస్ట్రేషన్.. నో ఇన్ కమ్...ఐదేండ్లుగా నాన్​ లే ఔట్లలో రిజిస్ట్రేషన్లు నిల్
  • లక్షల్లో ప్లాట్ల రిజిస్ర్టేషన్లు పెండింగ్​..  ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం​
  • జీవో 257పై నిర్ణయంపైనా ఎలాంటి తీసుకోని రాష్ట్ర సర్కార్  
  • ఇబ్బందుల్లో రియల్టర్లు, కస్టమర్లు
  • పర్మిషన్ ఇస్తే రిజిస్ర్టేషన్లు, ఎల్ఆర్ఎస్​ ద్వారా భారీగా ఇన్​కమ్​

మంచిర్యాల, వెలుగు :  బీఆర్ఎస్​సర్కారు తెచ్చిన జీవో 257 ప్రకారం పంచాయతీ, మున్సిపల్ పరిధిలోని నాన్​లే ఔట్లలో ప్లాట్ల రిజిస్ర్టేషన్లు ఐదేండ్లుగా కావడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో రిజిస్ర్టేషన్లు పెండింగ్​లో ఉండగా సర్కార్ కు  వచ్చే కూడా ఆదాయం పడిపోయింది. నాన్​లే ఔట్లు చేసిన రియల్టర్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. 

కొత్తగా రియల్​ఎస్టేట్​వెంచర్​చేయాలంటే ముందుగా డీటీసీపీ పర్మిషన్​తీసుకోవాలి. వెంచర్​లో 10 శాతం భూమిని పార్కులు, స్కూళ్లు, టెంపుల్స్​వంటి సామాజిక అవసరాలకు కేటాయిస్తూ సంబంధిత పంచాయతీ, మున్సిపాలిటీకి రిజిస్ర్టేషన్ చేయించాలి. 30 నుంచి 40 ఫీట్ల వెడల్పుతో బ్లాక్​టాప్​రోడ్లు వేయడంతో పాటు డ్రైనేజీలు నిర్మించడంతో పాటు కరెంట్​లైన్లు, వాటర్​పైపులైన్లు వేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకోవడంతో చాలామంది రియల్టర్లు డీటీసీపీ పర్మిషన్లు లేకుండానే పంచాయతీ, మున్సిపల్ పరిధిలో లేఔట్ల పేరిట వెంచర్లు వేశారు. 

రిజిస్ర్టేషన్లకు సబ్​రిజిస్ర్టార్లు డాక్యుమెంట్​కు ఇంత రేటు కట్టి తీసుకుని పని కానిచ్చేశారు. అయితే.. గత సర్కారు కొత్త పంచాయతీ, మున్సిపల్​చట్టాల ద్వారా నాన్​లేఔట్లకు చెక్​ పెట్టింది. ఇందుకు 2020 ఆగస్టు 26న జీవో 257 జారీ చేసింది. దీంతో పలువురు రియల్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 257 చట్టవిరుద్ధమంటూ హై కోర్టు రద్దు చేసింది. దీనిపై అప్పటి సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చింది. దీంతో నాన్​లేఔట్లలో రిజిస్ర్టేషన్ల కథ మళ్లీ మొదటికొచ్చింది. 

2020కి ముందు వాటికి పర్మిషన్ 

2020, ఆగస్టు 26కు ముందు నాన్​లేఔట్లలో 10 శాతం రిజిస్ర్టేషన్లు పూర్తయిన వెంచర్లలో ఎల్ఆర్ఎస్​ద్వారా    చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్​ఇచ్చింది. అయితే..10 శాతం రిజిస్ర్టేషన్లు పూర్తి కాని వెంచర్లతో పాటు, ఆ తర్వాత కొత్తగా చేసిన వెంచర్లలోనూ ఐదేండ్లుగా రిజిస్ర్టేషన్లు కావడం లేదు. దీంతో వెంచర్లు చేసిన రియల్టర్లు, ప్లాట్లు కొన్నవారు, అడ్వాన్సులు కట్టినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సమస్యపై తెలంగాణ రియల్​ఎస్టేట్​అసోసియేన్​ ప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కలిసి జీవో 257పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కానీ, సర్కారు నుంచి ఎలాంటి రెస్పాన్స్​లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. 2020, ఆగస్టు 26 తర్వాత చేసిన కొత్త నాన్​లేఔట్లపై కూడా ఏదో ఒక కటాఫ్​డేట్​ప్రకటించి ఎల్ఆర్ఎస్​ద్వారా రిజిస్ర్టేషన్లకు చాన్స్ కల్పించాలి. దీంతో స్టాంప్​డ్యూటీ, ఎల్ఆర్ఎస్, పర్మిషన్​చార్జీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. తద్వారా రియల్టర్లు, కస్టమర్లకు ఊరట కలగనుంది. 

ఎల్ఆర్ఎస్ కు చాన్స్ ఇవ్వాలి 

పంచాయతీ లే ఔట్లలో రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడంతో రియల్టర్లు, కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. 2020 సంవత్సరానికి ముందున్న వెంచర్లతో పాటు ఆ తర్వాత ఏర్పాటైన నాన్​లేఔట్లలో ఎల్ఆర్ఎస్​ద్వారా ప్లాట్ల రిజిస్ర్టేషన్లకు చాన్స్ ఇవ్వాలి. 

- వూడెం వెంకటస్వామి, మంచిర్యాల రియల్టర్స్​అసోసియేషన్​ ప్రెసిడెంట్​–