న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పదే పదే విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు సర్కార్పై మండిపడ్డారు. ఈసారి కరోనా వ్యాక్సిన్ విషయంలో గవర్నమెంట్ను టార్గెట్గా చేసుకొని కామెంట్స్ చేశారు. దేశంలో వైరస్ బారిన పడి 3 మిలియన్కు పైగా ప్రజలు బాధపడుతున్నారని, ఈ సమయంలో వ్యాక్సిన్ అందుబాటులో లేదంటూ సర్కార్ను రాహుల్ దుయ్యబట్టారు. సరైన స్ట్రాటజీతో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి సూచనలు కనిపించడం లేదన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంసిద్ధంగా లేకపోవడం హెచ్చరిస్తోందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థ పతనంపై తన హెచ్చరికలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యల ద్వారా క్లారిటీ వచ్చిందనే ట్వీట్ను జత చేశారు.
A fair and inclusive Covid vaccine access strategy should have been in place by now.
But there are still no signs of it.
GOI’s unpreparedness is alarming. https://t.co/AUjumgGjGC
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2020