- ఈసారి మెడిసిన్లో అమెరికా సైంటిస్టులు ఇద్దరికి అవార్డు
స్టాక్హోమ్: దెబ్బ తగిలితే మనకు నొప్పి ఎలా తెలుస్తోంది? ఎవరైనా టచ్ చేసినట్టు ఎలా ఫీలవగలుగుతున్నాం? ఇలాంటి వేడి, స్పర్శలను శరీరం ఎలా గుర్తిస్తుందో కనుగొన్న ఇద్దరు సైంటిస్టులే ఈసారి నోబెల్ప్రైజ్ కు ఎంపికయ్యారు. టచ్, టెంపరేచర్ రిసెప్టార్లను కనుగొన్న అమెరికాకు చెందిన డేవిడ్ జులియస్, అర్డెమ్పటపౌటియన్లను మెడిసిన్ లో నోబెల్కు సెలెక్ట్ చేసినట్టు నోబెల్ జ్యూరీ వెల్లడించింది. మన శరీరం బయటి పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నదో ఇంతకుముందు వరకు సైంటిస్టులకు చాలా తక్కువ తెలుసని, వీళ్లద్దరి పరిశోధనలతో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయని జ్యూరీ చెప్పింది. సెన్స్యొక్క సైకాలజీని మనం అర్థం చేసుకున్నామని.. అయితే వేడి, ఒత్తిడిని వేర్వేరుగా శరీరం ఎలా గుర్తిస్తోందో కనుక్కోలేదని వివరించింది. ఇలాంటి మార్పులను పసిగట్టే అణువులను (రిసెప్టార్లను) కనుక్కోవడం గేమ్ చేంజర్ అని చెప్పింది. వీటి వల్ల దీర్ఘకాలిక రోగాలు, నొప్పి బాధల నుంచి ఉపశమనం దొరికే అవకాశం ఉందంది. తాజా పరిశోధనల ఫలితంగా నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్స్తీరే మారిపోవచ్చని చెప్పింది. సైంటిస్టులు ఇప్పటికే స్పర్శకు సంబంధించిన రిసెప్టార్లను టార్గెట్ చేసే డ్రగ్స్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారంది. గుండె సంబంధిత రోగాల ట్రీట్మెంట్కు కూడా ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది.
మిరపకాయల్లోని కాప్సయిసిన్ను వాడి..
అమెరికాలోని న్యూయార్క్లో డేవిడ్ జులియస్ పుట్టారు. శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పని చేస్తున్నారు. మన శరీరంలోని నరాలు వేడికి చర్మం ప్రతిస్పందించేలా ఎలా కమ్యూనికేట్ చేస్తాయో తెలుసుకోవడానికి మిరపకాయల్లోని కాప్సయిసిన్ను వాడి డేవిడ్ ప్రయోగాలు చేశారు. మరో సైంటిస్టు పటాపౌటియన్ లెబనాన్లో పుట్టారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్నారు. యాంత్రిక ప్రేరణ (మెకానికల్ సిములేషన్)లకు స్పందించే ప్రెజర్ సెన్సిటివ్ సెన్సర్లను మనుషుల కణాల్లో పటాపౌటియన్గుర్తించారు. వేడి, ఒత్తిడికి ప్రతిస్పందించే గ్రాహకాలను (రిసెప్టార్స్) చర్మంలో ఈ సైంటిస్టులు కనుగొన్నారు. నోబెల్ ప్రైజ్తో పాటు గోల్డ్ మెడల్, రూ.8.5 కోట్ల ప్రైజ్మనీ అందిస్తారు. వీళ్లిద్దరికీ గతేడాదే న్యూరో సైన్స్లో కవ్లీ అవార్డు వచ్చింది.