- నామినేషన్ల పర్వం షురూ
- శుక్రవారం నామినేషన్వేసిన పది యూనియన్ల ప్రతినిధులు
- శనివారం దాఖలు చేయనున్న టీబీజీకేఎస్
- 11న రానున్న తీర్పుపై టెన్షన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు సింగరేణి ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నెల 28 సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు సెంట్రల్డిప్యూటీ లేబర్కమిషనర్, రిటర్నింగ్ఆఫీసర్శ్రీనివాసులు ఇటీవలే ఎన్నికల నోటిఫికేషన్రిలీజ్చేశారు. శుక్రవారం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. దీంతో మొదటి రోజు ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎమ్మెస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఇఫ్టూతో పాటు మొత్తం పది కార్మిక సంఘాలు హైదరాబాద్లోని సెంట్రల్డిప్యూటీ లేబర్కమిషనర్ఆఫీస్లో నామినేషన్లను దాఖలు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేమని సింగరేణి యాజమాన్యం నెల కిందట హైకోర్టుకు వెళ్లింది. సింగరేణిలోని టీబీజీకేఎస్తోపాటు మొత్తం 11 కార్మిక సంఘాలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయి. అయితే, కోర్టు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని చెప్పడంతో రిటర్నింగ్ఆఫీసర్గత నెల 27న ఎన్నికల నోటిఫికేషన్రిలీజ్చేశారు. దీంతో నామినేషన్ల స్వీకరణ మొదలుకావడంతో 15 సంఘాలకు గాను10 సంఘాల నుంచి నామినేషన్లు వేశాయి. నిన్న మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్మాత్రం నామినేషన్వేయలేదు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు యూనియన్ముఖ్య నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఇందులో శనివారం నామినేషన్వేయాలని డిసైడ్అయ్యారు.
నామినేషన్ వేయకపోతే అనర్హులవుతారని..
సింగరేణిలో గుర్తింపుసంఘం ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యంతో పాటు టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్మెస్, ఇఫ్టూ వంటి మొత్తం 11 సంఘాలు డిప్యూటీ సెంట్రల్ లేబర్కమిషనర్కు విన్నవించుకున్నాయి. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామంటూ ఏఐటీయూసీ, బీఎంఎస్ యూనియన్ల ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్ఆఫీసర్ శ్రీనివాసులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరో వైపు ఎన్నికలు వాయిదా వేయాలని సింగిల్జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం మూడు రోజుల కింద డివిజన్ బెంచ్కు వెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్ఈ నెల11కు కేసు వాయిదా వేసింది. సెంట్రల్డిప్యూటీ లేబర్కమిషనర్ మాత్రం ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. కోర్టు తీర్పు పక్కన పెడితే షెడ్యూల్ ప్రకారంగా నామినేషన్లు వేయకపోతే ఎన్నికల్లో ఆయా సంఘాలు అనర్హతకు లోనయ్యే అవకాశం ఉండడంతో ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలతో పాటు ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎమ్మెస్, ఇఫ్టూతో పాటు మరికొన్ని సంఘాలు నామినేషన్లు వేశాయి. కోర్టు తీర్పు ఎలా ఉన్నా శనివారం నామినేషన్ వేయాలని టీబీజీకేఎస్ నిర్ణయించుకుంది.సాయంత్రం వరకు నామినేషన్లకు గడువు ఉందని రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు.
నామినేషన్లు వేసింది వీరే..
బీఎంఎస్ తరపున సింగరేణి కోల్మైన్స్కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేశ్, ఏబీకేఎంఎస్ నేతలు పులి రాజారెడ్డి, ఆరుట్ల మాధవరెడ్డి, సింగరేణి కాలరీస్వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) తరపున ఆ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు బాలరాజు, వంగా వెంకట్, బోసు, వేణు నామినేషన్లు వేశారు. హెచ్ఎమ్మెస్ నుంచి ఆ యూనియన్అధ్యక్షుడు రియాజ్అహ్మద్, ఐఎన్టీయూసీ నుంచి జనరల్సెక్రెటరీ జనక్ ప్రసాద్, నాయకులు చంద్రశేఖర్, నరసింహారెడ్డి, త్యాగరాజన్నామినేషన్లు దాఖలు చేశారు.