- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్
- ఎస్ఐబీ అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఠాణాలో కేసు
- ప్రణీత్రావుకు సహకరించిన అధికారులపైనా ఎఫ్ఐఆర్ నమోదు
పంజాగుట్ట, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెండైన మాజీ డీఎస్పీ ప్రణీత్రావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ డి.రమేశ్ ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రణీత్రావుతోపాటు ఆయనకు సహకరించిన అధికారులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ విభాగంలో ప్రణీత్రావు కీలక పోస్టులో ఉన్నాడు.
అప్పట్లో ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలు, ప్రజాసంఘాల, జర్నలిస్టుల కీలక సమాచారాన్ని సేకరించి ఎస్ఐబీ లాగర్లో భద్రపరిచేవాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నాటి అధికార పార్టీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రావడంతో .. ప్రణీత్రావు ఎస్ఐబీ ఆఫీసులో సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, అక్కడి హార్డ్డిస్కుల్లోని సమాచారం మొత్తాన్ని మరో సిస్టంలోకి ట్రాన్స్ఫర్చేశాడు. అప్పటి వరకు వినియోగించిన కంప్యూటర్లు, హార్డ్డిస్కులను కూడా ధ్వంసం చేశాడు. ఇట్ల ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలను మాయం చేసేందుకు ప్రణీత్రావు ప్లాన్ చేశాడని అధికారులు గుర్తించారు. ప్రణీత్రావు పై ఐపీసీ 409,427,201,120 (బి) పి.డి.పి.పి. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. అతడికి సహకరించిన అధికారులపైనా కేసులు ఫైల్ అయ్యాయి.