
ఉత్తర కొరియాలోని ప్రమాదకర పర్వతం పెక్టుపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గుర్రంపై స్వారీ చేశారు. మంచుతో కప్పి ఉండే ఆ పర్వత అందాలను కిమ్ ఎంతగానో ఆస్వాదించారని అక్కడి న్యూస్ ఏజెన్సీ KCNA తెలిపింది. ఒంటరిగా తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ కిమ్ సంతోషంగా పర్వతాలపై గడపడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కొరియాలో అది చాలా ప్రమాదకరమైన పర్వతమయినప్పటికీ ఆయన దాన్ని అదిరోహించారని తెలిపింది.
కిమ్ జోంగ్ ఉన్ ఏ మాత్రం భయపడకుండా ఈ యాత్రను పూర్తి చేశారు. సాధారణంగా ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇటువంటి యాత్రలు చేస్తారు. ఈ సాహసయాత్ర పూర్తి చేసిన ఆయన ఏదైనా కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలో ఆధ్యాత్మికంగా కిమ్ వంశానికి చాలా ప్రధానమైన పర్వతం పెక్ట్.