
హైదరాబాద్, వెలుగు: తమ దేశానికి మరింత మంది భారతీయ టూరిస్టులను ఆకర్షించడం, తనను తాను సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు ప్రదర్శనల (మైస్) గమ్యస్థానంగా నిలబెట్టుకోవడానికి శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో హైదరాబాద్లో మంగళవారం (జులై 01) రోడ్ను నిర్వహించింది.
శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో (ఎస్ఎల్బీబీ) దీనిని ఏర్పాటు చేసింది. భారతీయ ‘మైస్’ ప్లానర్లు, కార్పొరేట్ ట్రావెల్ నిపుణులు, ట్రావెల్ ట్రేడ్ పార్టనర్లు, ఎస్ఎల్సీబీ అధికారులు, హోటళ్లు, టూర్ ఆపరేటర్లు కార్యక్రమానికి హాజరయ్యారు.
శ్రీలంక , భారతదేశం మధ్య బంధాలను బలోపేతం చేయడం, పర్యాటక , మైస్ రంగాలలో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను పెంపొందించడం తమ లక్ష్యమని చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హై కమిషన్ లో యాక్టింగ్ డిప్యూటీ హైకమిషనర్ హర్ష రూపరత్నే చెప్పారు. ఈ ఏడాది జనవరి– మే మధ్య 2,04,060 మంది భారతీయులు తమ దేశాన్ని సందర్శించారని చెప్పారు.