బ్లాక్​లో ఐపీఎల్​ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్

బ్లాక్​లో ఐపీఎల్​ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: బ్లాక్​లో ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన 100 ఐపీఎల్ టికెట్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. బెంగళూరులో ఉండే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి చిత్తూరు రమణ(27), హైదరాబాద్​లో ఉంటూ డిజిటల్​మార్కెటింగ్ చేస్తున్న న్యాలకల్ సామ్యుయేల్​సుశీల్(29) ఫ్రెండ్స్.

దేశంలోని క్రికెట్​అభిమానులతో కూడిన వాట్సాప్ ​గ్రూపుల్లో వీళ్లు మెంబర్లు. మ్యాచ్​ల టైంలో టికెట్ల గురించి ఆరా తీస్తుంటారు. అలాగే ఇద్దరూ కలిసి ఆన్​లైన్​లో టికెట్లు బుక్​చేస్తుంటారు. రమణ గతంలో వన్డే క్రికెట్ మ్యాచ్​టికెట్లను బ్లాక్​లో విక్రయిస్తూ చెన్నై పోలీసులకు చిక్కాడు. అయినా మార్పు రాలేదు. ఈజీ మనీ కోసం బ్లాక్​లో టికెట్లు విక్రయించాలని ప్లాన్​చేశాడు. సామ్యుయేల్​సుశీల్​తో కలిసి ఐపీఎల్​అభిమానులను టార్గెట్​చేశారు. ఆన్​లైన్​లో టికెట్లు పెట్టిన వెంటనే బుక్​చేసి, వాటిని బయట అధిక ధరలకు అమ్ముతున్నారు. గురువారం ఎస్ఆర్​హెచ్, బెంగళూరు మ్యాచ్​కు పెద్ద ఎత్తున బ్లాక్​లో అమ్మాలని చూసి పోలీసులకు చిక్కారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి  గోపాలపురం పోలీసులకు అప్పగించారు.