- కొవిడ్ థర్డ్ వేవ్ భయంతో వాయిదాలు
- షాపుల ఓపెన్కు
- ఔత్సాహికులు నో ఇంట్రెస్ట్
హైదరాబాద్, వెలుగు: కరోనా థర్డ్ వేవ్ భయంతో కొత్త బిజినెస్లు స్టార్ట్చేసేందుకు, ఉన్న వాటిని డెవలప్ చేసేందుకు వెనకాడుతున్నారు. కరోనా, లాక్ డౌన్ సమయాల్లోనే బిజినెస్లు మూతపడడంతో చిరు వ్యాపారుల నుంచి పెద్ద బిజినెస్ల వరకు ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొందరు బిజినెస్లను తీసేశారు. ఇప్పుడూ అదే జరిగితే పరిస్థితేంటునుకుంటూ వెయిట్ చేయడమే బెటరని డిసైడ్ అయ్యారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బట్టల షాపులు, జిమ్స్, స్వీట్ హౌజ్ ల నుంచి క్యాబ్ల వరకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇది వరకే షాపులకు అడ్వాన్స్ఇచ్చిన వారు కూడా నెల, రెండు నెలల అద్దె పోయినా సరే అని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో అంతా నార్మల్గా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ హోటల్ ఇండస్ర్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేసులు మళ్లీ పెరిగితే ముందుగా మూతపడేవి హోటల్స్ కావడంతో కొత్తగా ఏర్పాటుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. గ్రేటర్ లోని అన్నిచోట్ల షాపుల కోసం స్పేస్ ఉన్నట్లు టూ లెట్ బోర్డులు చాలా ఉన్నాయి. గతేడాది లాక్ డౌన్ టైమ్లో ఖాళీ చేసిన షాపులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పడిప్పుడే బిజినెస్లు స్టార్ట్చేద్దామనుకొనే వారు కూడా వెనక్కి తగ్గి మరి కొన్నాళ్లు ఖాళీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాలనీల నుంచి కమర్షియల్ కారిడార్ల వరకు టూ లెట్ బోర్డులే కనిపిస్తున్నాయి.