ఆత్మీయ సమ్మేళనాలతో ఒరిగేదేమి లేదు: కూనంనేని 

ఆత్మీయ సమ్మేళనాలతో ఒరిగేదేమి లేదు: కూనంనేని 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆత్మీయ సమ్మేళనాలతో ఒరిగేదేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. ఈ నెల 14న భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండలం నుంచి చేపట్టిన ప్రజా పోరు యాత్ర గురువారం కొత్తగూడెంలో ముగిసింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్​ చేశారు.

బీజేపీ ప్రభుత్వం ప్రజలను మాయమాటలతో మోసం చేస్తొందన్నారు. అదానీలు, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. జిల్లా సెక్రెటరీ ఎస్​కె. సాబీర్​ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, బందెల నర్సయ్య తదతరులు పాల్గొన్నారు.